మోదుగుల డుమ్మా....బాబు అసహనం...!!

Update: 2018-12-21 09:02 GMT

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. ప్రతి మంత్రివర్గం సమావేశానికి ముందు సమన్వయ కమిటీ సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సమావేశంలో చంద్రబాబునేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జులు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది.

మోదుగుల, జేసీ గైర్హాజరు....

అయితే కొద్దిసేపటి క్రితం సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు హాజరుకాలేదు. వీరితో పాటు వ్యక్తిగత పనుల కారణంగా మంత్రులు శిద్ధారాఘవరావు, అయ్యన్నపాత్రుడు హాజరుకాలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పదవులు రాని వారు నిరాశతో పనిచేయడం లేదని, పదవులు వచ్చిన వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పనిచేయడం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Similar News