శివరాంను ఓదార్చిన చంద్రబాబు

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కోడెల శివరాంను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఓదార్చారు. నిన్న కోడెల ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన [more]

Update: 2019-09-17 10:48 GMT

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కోడెల శివరాంను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఓదార్చారు. నిన్న కోడెల ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన కుమారుడు శివరాం కెన్యాలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న శివరాం హుటా హుటిన కెన్యా నుంచి బయలుదేరారు. ఇవ్వాళ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తండ్రి అంతిమ యాత్ర సాగుతుండగా మార్గ మధ్యలోని ఇబ్రహీం పట్నం వద్ద తండ్రి మృతదేహాన్ని చూసి శివరాం తల్లడిల్లిపోయాడు. ఈ సమయంలో కోడెల పార్థీవ దేహం వెంటే వస్తున్న చంద్రబాబు శివరాంను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

 

Tags:    

Similar News