రేపు నెల్లూరుకు చంద్రబాబు

Update: 2018-04-25 14:17 GMT

రేపు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు నెల్లూరులో జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నెల్లూరు వెళుతున్నారు. టీడీపీలో చేరిన ఆనం వివేకానందరెడ్డి మరణం పార్టీకి లోటని ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. రేపు నెల్లూరులో జరగనున్న ఆనం వివేకా అంత్యక్రియల్లో మంత్రులు కూడాపాల్గొననున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Similar News