వంశీ, దేవినేని లపై బాబు రెస్పాన్స్ ఇదే

మా పార్టీ నుంచి ఇద్దరు నాయకులను చేర్చుకుంటారా? అని చంద్రబాబు మండిపడ్డారు. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ చేరికలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇలాంటి [more]

Update: 2019-11-15 01:45 GMT

మా పార్టీ నుంచి ఇద్దరు నాయకులను చేర్చుకుంటారా? అని చంద్రబాబు మండిపడ్డారు. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ చేరికలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటారన్నారు. అయితే వీటికి తాను భయపడపోనని చెప్పారు. జగన్ లాంటి రాజకీయనాయకులను వేల మందిని చూశానన్నారు. తాను వంద మంది నాయకులను తయారు చేయగలనని చెప్పారు. ప్రతి పనిలో జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తనపై కోపంతో ప్రజా వేదికను కూల్చారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. భయపెట్టి లొంగతీసుకోవడం జగన్ తత్వమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News