పనికి మాలిన ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ ఒక పనికి మాలిన ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఇసుక [more]

Update: 2019-11-14 04:02 GMT

వైఎస్ జగన్ ఒక పనికి మాలిన ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాగా మారారన్నారు. మా ఊళ్లో ఇసుకపై మీ పెత్తనమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇసుక కోసం ఆరు నెలలు ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. బెంగళూరు, హైదరాబాద్ కు అక్రమంగా ఇసుక ఎందుకు తరలిపోతుందని నిలదీశారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తూ తమపై ఎదురు దాడికి వైసీపీ నేతలు దిగుతున్నారన్నారు.

Tags:    

Similar News