ఎంత మందిపై పెడతారు?

వైసీపీ ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అఖిలప్రియ, చింతమనేని ప్రభాకర్ [more]

Update: 2019-10-29 05:01 GMT

వైసీపీ ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అఖిలప్రియ, చింతమనేని ప్రభాకర్ లపై తప్పుడు కేసులు పెట్టిందన్నారు. కోడెల శివప్రసాద్ ను తప్పుడు కేసులతోనే బలి తీసుకుందన్నారు. వల్లభనేని వంశీని కూడా వదిలిపెట్టకుండా అక్రమ కేసులను నమోదు చేస్తుందన్నారు. దీనిపై సమిష్టిగ పోరాటం చేయాల్సిందేనన్నారు. రాష్ట్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటనకు వచ్చిందని, వైసీపీ నేతల బాధితులంతా కమిషన్ ను కలవాలని చంద్రబాబు సూచించారు. ఇసుక కొరత మానవతప్పిదమేనని, జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News