అధికారంలో ఉన్నా ..లేకున్నా?

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సామాజిక సమమగ్ర అభివృద్ధికి మార్గాలు అనే అంశంపై చంద్రబాబు ఆన్ లైన్ [more]

Update: 2021-06-12 07:08 GMT

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సామాజిక సమమగ్ర అభివృద్ధికి మార్గాలు అనే అంశంపై చంద్రబాబు ఆన్ లైన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు సోనూ సూద్ కూడా పాల్గొన్నారు. కరోనా విపత్తు సమయంలో సోనూ సూద్ సేవలు అందరూ కొనియాడాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో అనేక మంది నష్టపోయారన్నారు. యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆన్ లైన్ లో వైద్యుల సేవలను అందిస్తుందన్నారు. అనేక మందిని కరోనా నుంచి కాపాడుకోగలిగామన్నారు. కరోనా కట్టడికి అందరికీ వ్యాక్సినేషన్ అవసరమని చంద్రబాబు అన్నారు. రెండు డోసులు తీసుకుంటే ఎక్కువ ఇమ్యునిటీ వస్తుందిని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News