అధికారం కోసం కాదు.. ప్రజల భవిష్యత్ కోసమే

తనకు అధికారం, ముఖ్యమంత్రి పదవి కొత్తేమీ కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తనకు సీఎం పదవి [more]

Update: 2021-04-11 01:24 GMT

తనకు అధికారం, ముఖ్యమంత్రి పదవి కొత్తేమీ కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తనకు సీఎం పదవి కొత్తేమీకాదన్నారు. అయితే రాష్ట్ర ప్రజల భవిష్యత్ పైనే తన ఆందోళన ఉందని చెప్పారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ చేయాలనుకున్నానని, కానీ జగన్ వచ్చి అన్నింటినీ సర్వనాశనం చేశాడని చంద్రబాబు విమర్శించారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించి జగన్ ప్రబుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

Tags:    

Similar News