ఎయిర్ పోర్టులో 9గంటల పాటు చంద్రబాబు నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న ఉదయం నుంచి తిరుపతి ఎయిర్ పోర్టులోనే నిరసన తెలిపారు. తనను అడ్డుకున్న ప్రభుత్వానిది పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఉదయం [more]

Update: 2021-03-02 00:36 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న ఉదయం నుంచి తిరుపతి ఎయిర్ పోర్టులోనే నిరసన తెలిపారు. తనను అడ్డుకున్న ప్రభుత్వానిది పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఉదయం పది గంటలకు ఎయిర్ పోర్టులోకి దిగిన చంద్రబాబు రాత్రి వరకూ తన నిరసనను కొనసాగించారు. దాదాపు 9 గంటలు చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో నిరసన వ్యక్తం చేశారు. రాత్రి 7.10 గంటల విమానంలో చంద్రబాబు తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిపోయారు.

Tags:    

Similar News