రేణిగుంట ఎయిర్ పోర్ట్ లోనే బాబును అడ్డుకున్నపోలీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన కోసం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే [more]

Update: 2021-03-01 04:36 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన కోసం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులోనే చంద్రబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎయిర్ పోర్టులోకి టీడీపీ నేతలను కూడా ఎవరినీ అనుమతించలేదు. ఇప్పటికే టీడీపీ నేతలను చిత్తూరు, తిరుపతిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీఐపీ లాంజ్ లో చంద్రబాబు పోలీసులతో మాట్లాడుతున్నారు.

Tags:    

Similar News