చంద్రబాబు ఆస్తుల కేసు వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వాయిదా పడింది. వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుపై [more]

Update: 2020-10-21 07:12 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వాయిదా పడింది. వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుపై లక్ష్మిపార్వతి వేసిన కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. 2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తులు పై ఏసీబీ కి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేశారు. 2005 లో చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నడంటూ లక్ష్మీ పార్వతి ఏసీబీ కి ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005 లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా దీనిపై స్టే ఉంది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ఉన్న స్టే లు ఎత్తివేయడంతో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు నవంబరు 24వ తేదీకి వాయిదా పడింది.

Tags:    

Similar News