లేఖలు వద్దు.. సీల్డ్ కవర్ లో పంపండి..బాబుకు డీజీపీ లేఖ

వాస్తవాలు తెలుసుకోకుండా బహిరంగ లేఖలు రాయడం సరికాదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై వైసీపీ [more]

Update: 2020-09-29 03:46 GMT

వాస్తవాలు తెలుసుకోకుండా బహిరంగ లేఖలు రాయడం సరికాదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ నిన్న చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని, ఏదైనా ఆధారాలు ఉంటే తమకు సీల్డ్ కవర్ ద్వారా తెలియజేయాలని, మీడియా రూపంలో లేఖలు విడుదల చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని డీజీపీ గౌతంసవాంగ్ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆధారాలుంటే పంపాలని, అవి నిజమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా మీడియాకు లేఖలు విడుదల చేయడం సరికాదని డీజీపీ పేర్కొన్నారు.

Tags:    

Similar News