నా సూచనలు పట్టించుకోనందుకే కరోనా వ్యాప్తి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. ఏపీ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్నికి ఆయన ఆరు పేజీల లేఖ రాశారు. కరోనా వ్యాప్తి ఏపీలో [more]

Update: 2020-08-30 06:32 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. ఏపీ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్నికి ఆయన ఆరు పేజీల లేఖ రాశారు. కరోనా వ్యాప్తి ఏపీలో తీవ్రంగా ఉందని, ఫ్రంట్ లైన్ వారియర్స్ భద్రతను పట్టించుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. టెస్టింగ్ సరళిలోనూ మార్పులు చేయాలని కోరారు. ఫ్రంట్ లైట్ వారియర్స్ కు పీపీఈ కిట్స్ పంపిణీ చేయాలన్నారు. తాను తొలి నుంచి కరోనా వ్యాప్తిపై సూచనలు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందువల్లనే రాష్ట్రం మొత్తం కరోనా వ్యాపించిందని చంద్రబాబు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా కేసులు నాలుగు లక్షలు దాటిపోయినా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని చంద్రబాబు లేఖలో తెలిపారు.

Tags:    

Similar News