విశాఖను వీళ్లు మింగేస్తారు

ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరాన్ని అరాచరకాలకు అడ్డాగా మారుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అని చెప్పి భూములను ఆక్రమించుకునే పనిలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. [more]

Update: 2020-08-20 02:46 GMT

ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరాన్ని అరాచరకాలకు అడ్డాగా మారుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అని చెప్పి భూములను ఆక్రమించుకునే పనిలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. వైసీపీ నేతలకు భయపడే విశాఖ ప్రజలు నగరంలో ఆ పార్టీని ఓడించారని తెలిపారు. తాము విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే వైసీపీ మాత్రం అరచకాలకు నిలయంగా మార్చిందన్నారు. ఇళ్ల స్థలాల పట్టాలకు లక్షల్లో వసూలు చేస్తున్నారని చంద్రబాబుఆరోపించారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా టీడీపీ శాసనసభలో ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు మూడు లక్షలు దాటినా, రోజుకు 80 మందికిపైగా చనిపోతున్నా దానిపై కేబినెట్ లో చర్చించకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News