నేడు చంద్రబాబు దీక్ష.. ఎందుకంటే?

అమరావతి రైతుల ఉద్యమం 200 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయనున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. హైదరాబాద్ లో ఉన్న [more]

Update: 2020-07-04 03:51 GMT

అమరావతి రైతుల ఉద్యమం 200 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయనున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నేడు అమరావతికి చేరుకోనున్నారు. మంగళగిరిలోని పార్టీకార్యాలయానికి వచ్చి ఆయన దీక్ష చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ రైతులు చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతుగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News