ఏపీ ప్రజలారా… ఇకనైనా మేల్కోండి

ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పాలకుల చేతకానితనం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఏపీ ప్రజలకు [more]

Update: 2020-06-11 05:10 GMT

ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పాలకుల చేతకానితనం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అవినీతి, కక్ష సాధింపుల వల్లనే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ హయాంలోకన్నా వైసీపీ పాలనలోనే ఆదాయం అధికంగా ఉందని, అయినా అభివృద్ధి పనులను చేపట్టడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్షేమాన్ని కూడా కొందరికే దక్కేలా వైసీపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికీ కీడు, ప్రజలకు చేటు తప్పదని చంద్రబాబు తన లేఖలో హెచ్చరించారు.

Tags:    

Similar News