బోగస్ లెక్కలొద్దంటున్న బాబు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కేవలం పన్నెండు గంటల వ్యవధిలో 8,622 మందికి పరీక్షలు చేయడం ఎలా సాధ్యమయిందని ప్రశ్నించారు. [more]

Update: 2020-04-18 04:28 GMT

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కేవలం పన్నెండు గంటల వ్యవధిలో 8,622 మందికి పరీక్షలు చేయడం ఎలా సాధ్యమయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ల్యాబ్ ల ద్వారా ఈ టెస్టులను చేయడం అసాద్యమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటన్ అంతా బోగస్ అని చంద్రబాబు తేల్చిపారేశారు. ఈ లెక్కలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు, నెల్లూరు. గుంటూరు, అనంతపురంలలో వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చంద్రబాబు జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News