బ్రేకింగ్ : ప్రధానితో ఈరోజే మాట్లాడా..అన్ని విషయాలు చెప్పా

కరోనా విషయంలో రాష్ట్రం తన ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో కేసుల సంఖ్య [more]

Update: 2020-04-14 07:55 GMT

కరోనా విషయంలో రాష్ట్రం తన ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందన్నారు. అగ్రరాజ్యలే కరోనాదెబ్బకు విలవిలలాడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లైట్ గా తీసుకుంటుందన్నారు. తాను మేధావులతో సమావేశమయ్యాయని, మూడు జోన్లుగా విభజించాలని గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ లుగా చేయాలని తాను ప్రధానికి గతంలో లేఖరాశానన్నారు. జోన్ల వారీగా లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవ్వాలని తాను ప్రధానికి రాసిన లేఖలో సూచించానని చెప్పారు. తాను ప్రధానితో మాట్లాడాలనుకుంటున్నానని పీఎం పేషీకి తెలిపానన్నారు. ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ తనతో మాట్లాడారన్నారు. లాక్ డౌన్ పై తీసుకుంటున్న, తీసుకోవాల్సిన విషయాలను చర్చించామన్నారు. తనకు ఇది ఎంతో సంతోషం కలిగిందన్నారు. అన్నీ తనకు తెలుసునన్న అహంభావం పనికి రాదన్నారు. ప్రధాని చెప్పిన ఏడు సూత్రాాలు అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News