దాచి పెడితే మరింత కీడే

కరోనా పాజిటివ్ కేసులను దాచిపెడితే మరింత కీడు జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ లుగా మారడానికి ప్రభుత్వ వైఫల్యమే [more]

Update: 2020-04-13 12:25 GMT

కరోనా పాజిటివ్ కేసులను దాచిపెడితే మరింత కీడు జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ లుగా మారడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చంద్రబాబు అన్నారు. ఆయన పార్టీ నేతలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సమయంలోనూ వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కొత్త ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ ను రాష్ట్రంలోకి ఎలా అనుమతిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను కరోనా నుంచి కాపాడినందుకు తొలగించారా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News