నిమ్మగడ్డ తొలగింపుపై చంద్రబాబు సీరియస్

నిమ్మగడ్డ తొలగింపు అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తి కాకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారని [more]

Update: 2020-04-10 13:02 GMT

నిమ్మగడ్డ తొలగింపు అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తి కాకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఆర్డినెన్స్ తీసుకురావడమేమిటని చంద్రబాబు లేఖలో కోరారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆర్డినెన్స్ ను తెచ్చి ఉంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ నియంతలా నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. దొడ్డిదారిన ఆర్డినెన్స్ ను ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News