భయపడొద్దని కోడెల కు చెప్పా

కేసులకు భయపడొద్దని తాను చాలా సార్లు కోడెల శివప్రసాద్ కు చెప్పానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల శివప్రసాద్ పై కేసులు పెట్టి ప్రభుత్వం [more]

Update: 2019-09-30 09:59 GMT

కేసులకు భయపడొద్దని తాను చాలా సార్లు కోడెల శివప్రసాద్ కు చెప్పానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల శివప్రసాద్ పై కేసులు పెట్టి ప్రభుత్వం వేధించిందన్నారు. కోడెల శివప్రసాద్ సంతాపసభలో చంద్రబాబు ప్రసంగించారు. పల్నాడులో 500 కుటుంబాలను తరిమేశారన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు రోజురోజకూ పెరిగిపోతున్నాయన్నారు. కోడెల విగ్రహ ప్రతిష్టకు కూడా ప్రభుత్వం అనుమతివ్వడం లేదని చంద్రబాబు ఆవేదన చెందారు. వైఎస్ విగ్రహాలు పెట్టేందుకు ఎవరు అనుమతిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక దొరకని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నారు. ఇరవై లక్షల కుటుంబాలు ఉపాధి దొరకక రోడ్డుమీద పడ్డాయని ఆవేదన చెందారు. ఈ రాష్ట్రం వైసీపీ వాళ్ల జాగీరు కాదన్నారు. రాష్ట్రం కోసం పనికి వచ్చే ఒక్క పనీ ప్రభుత్వం చేయడం లేదన్నారు. గోదావరిలో బోటు మునిగితే ఇంతవరకూ తీయలేదన్నారు. కోడెలను మానసిక క్షోభకు గురిచేసినందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News