జగన్ కు సిగ్గుందా?

ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోనని చెప్పిన జగన్ ఇప్పుడెందుకు చేర్చుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు సిగ్గుందా? అని నిలదీశారు. స్థానిక సంస్థల [more]

Update: 2020-03-09 14:31 GMT

ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోనని చెప్పిన జగన్ ఇప్పుడెందుకు చేర్చుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు సిగ్గుందా? అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లు రిజర్వేషన్లను మార్చారన్నారు. ఎన్నికల సంఘం కూడా పనికిరానిదిగా మారిపోయిందన్నారు. అయినా అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. తమిళనాడు నుంచి మద్యం తీసుకువచ్చి పంపీణీ చేస్తున్నారన్నారు. ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత కూడా కేసులేమిటని ప్రశ్నించారు. వార్డుల పునర్విభజనతోనే అవకతవకలు ప్రారంభమయ్యాయన్నారు. ఇంత విచ్చలవిడితనం ఎప్పుడూ లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో వైసీపీ నేతలు బెదిరిస్తున్న వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News