రద్దు చేసినా మేం తెస్తాం

శాసనమండలిని రద్దు చేసినా పరవాలేదని తాము వచ్చిన తర్వాత తిరిగి పునరుద్ధరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. శాసనమండలిలో ప్రజాస్వామ్యంగా తాము వ్యవహరిస్తే దానిని కూడా వైసీపీ [more]

Update: 2020-01-24 10:41 GMT

శాసనమండలిని రద్దు చేసినా పరవాలేదని తాము వచ్చిన తర్వాత తిరిగి పునరుద్ధరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. శాసనమండలిలో ప్రజాస్వామ్యంగా తాము వ్యవహరిస్తే దానిని కూడా వైసీపీ బుల్ డోజ్ చేయాలని చూస్తుందని చంద్రాబు ఆరోపించారు. మండలిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. తీర్మానం చేసినా కేంద్రం అంగీకరించే పరిస్థితి ఉండదన్నారు. రద్దు చేసినా ఒకటిన్నరేళ్లు పడుతుందిని తెలిపారు. ఒకవేళ రద్దు చేసినా తిరిగి తాము తీసుకు వస్తామని చప్పారు. మండలి స్వయంప్రతిపత్తి ఉన్న వ్యవస్థ అని చంద్రబాబు తెలిపారు. ఆర్థిక ఉగ్రవాడి జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఎల్లుండి టీడీఎల్పీ సమావేశం ఉందని, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

Tags:    

Similar News