ఎవరి అబ్బ సొత్తని?

రాజధానిని మూడు ముక్కలు చేయడానికి ఎవరి అబ్బ సొత్తు అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. ఏపీ [more]

Update: 2020-01-18 13:09 GMT

రాజధానిని మూడు ముక్కలు చేయడానికి ఎవరి అబ్బ సొత్తు అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎనిమిది నెలలుగా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని? గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజధానికి సెంటర్ పాయింట్ ఏంటో జగన్ కు తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు. భీమవరం సభలో పాల్గొన్న చంద్రబాబు ఏడు నెలల్లోనే ఏ ప్రభుత్వం ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కొనలేదన్నారు. అమరావతిని రక్షించుకోవడానికి అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు. లేకుంటే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు

Tags:    

Similar News