పోలీసులపై ఫైర్

రైతుల అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఫైర్ అయ్యారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. [more]

Update: 2019-12-30 04:44 GMT

రైతుల అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఫైర్ అయ్యారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు. పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాల కాని, భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు కేసులేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయమన్నారు. దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులు ఎలా చేస్తారని నిలదీశారు. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్ లతో రైతుల ఆందోళనలను అణిచివేయలేరని చంద్రబాబు అన్నారు

Tags:    

Similar News