గోరంట్ల మాధవ్ పై చంద్రబాబు?

హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ పై అత్యాచారం కేసు ఉందని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలిపారు. మహిళల భద్రతపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు [more]

Update: 2019-12-09 08:35 GMT

హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ పై అత్యాచారం కేసు ఉందని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలిపారు. మహిళల భద్రతపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు గోరంట్ల మాధవ్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు అనేక చోట్ల మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, దానిని అరికట్టడానికి బలమైన చట్టాలు చేయాలన్నారు. ఒంగోలులో బాలికపై వైసీపీ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. నిర్భయ చట్టం సక్రమంగా అమలు కాలేదని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ వాలంటీర్ బాలికపై అత్యాచారానికి దిగారన్నారు. ముందు జగన్ ఈ అఘాయిత్యాలను అరికట్టాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News