జగన్ పై బాబు సెటైర్లు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరని, తనకు తానుగా తెలుసుకోలేడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు. పీపీఏలపై సమీక్ష వద్దని చెప్పినా జగన్ [more]

Update: 2019-08-14 14:20 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరని, తనకు తానుగా తెలుసుకోలేడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు. పీపీఏలపై సమీక్ష వద్దని చెప్పినా జగన్ వినడం లేదన్నారు చంద్రబాబు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులోనే ఉంటే మిగిలిన సగం ఆయన చేసే పనుల్లో ఉందన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేసినా కేసులు ఉండవని, ఇందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేసు ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News