వంశీ ప్లేస్ ను ఆయనకు అప్పగించాలి

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ తర్వాత నాయకత్వం ఎవరు చేపడతారన్న చర్చ మొదలయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గన్నవరం [more]

Update: 2019-10-31 11:39 GMT

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ తర్వాత నాయకత్వం ఎవరు చేపడతారన్న చర్చ మొదలయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకు వల్లభనేని వంశీ రాలేదు. అయినా గన్నవరం నుంచి టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వారంతా దేవినేని అవినాష్ కు గన్నవరం బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పకుండా, తర్వాత చూద్దామని సమీక్షను ముగించారు.

Tags:    

Similar News