చంద్రబాబు సీరియస్.. రేపు ఢిల్లీలో ధర్నా

ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత స్పీడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావొద్దని పట్టుదలగా ఉన్న ఆయన బీజేపీయేతర [more]

Update: 2019-05-20 06:55 GMT

ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత స్పీడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావొద్దని పట్టుదలగా ఉన్న ఆయన బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ఢిల్లీలో బిజీబిజీ ఉంటున్న చంద్రబాబు నిన్న ఉత్తరప్రదేశ్ వెళ్లి మాయావతి, అఖిలేష్ యాదవ్ ను కలిసి వచ్చారు. ఇవాళ ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలవనున్నారు. ఇక, ఈసీపైనా తన పోరాటాన్ని చంద్రబాబు కొనసాగించనున్నారు. వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలనే డిమాండ్ తో ఆయన రేపు ఎన్డీయేతర పక్షాల నేతలతో కలిసి ధర్నా చేయనున్నారు. ఎల్లుండి ఇదే అంశంపై రాష్ట్రపతిని కలవనున్నారు. మొత్తంగా 23న ఫలితాలు వచ్చే వరకు చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు.

Tags:    

Similar News