జగన్ ఇంకా ఎన్నాళ్లు?

జగన్ అరాచక పాలన ఎన్నాళ్లు కొనసాగుతుందోనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు [more]

Update: 2019-09-26 07:10 GMT

జగన్ అరాచక పాలన ఎన్నాళ్లు కొనసాగుతుందోనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు. అడ్డుకుంటారనే కారణంతోనే ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబును ఉన్న పళంగా బదిలీ చేశారని చంద్రబాబు చెప్పారు. రైతులకు రుణమాఫీ రద్దు చేసి పేద రైతుల కడుపును జగన్ కొట్టారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాల మయంగా మార్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 750 కోట్లు ఆదా చేస్తామని చెప్పి 7500 కోట్లు నష్టం చేకూర్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.ఇసుక కొరతతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. పార్టీ నేతలతో ఆయన కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైసీపీ దోపిడీని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

Tags:    

Similar News