టెర్రరిస్టుల్లా మారారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెర్రరిస్టుల్లా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసి కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ [more]

Update: 2019-08-27 14:38 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెర్రరిస్టుల్లా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసి కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అన్నా క్యాంటిన్లపై టీడీపీ చేసిన ఆందోళన సక్సెస్ అయిందన్నారు. ఈనెల 30వ తేదీన ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పేదల కడుపుకొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులనుబనాయిస్తుందన్నారు. న్యాయపరంగా వాటిని ఎదుర్కొంటామని నేతలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

Tags:    

Similar News