జగన్ తన కొమ్మను తానే

జగన్ తన కొమ్మను తానే నరుక్కుంటున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పోలవరంపై సీబీఐ విచారణ [more]

Update: 2019-07-16 04:37 GMT

జగన్ తన కొమ్మను తానే నరుక్కుంటున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పోలవరంపై సీబీఐ విచారణ జరపాలని విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగితే కేంద్రమంత్రి అవసరం లేదని చెప్పాడన్నారు. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికి రాలేదని తీప్పుడు వాదనలకు వైసీపీ నేతలు దిగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ ఆర్ ఆర్ కోసం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోవేనని చెబుతుందన్నారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారు చంద్రబాబునాయుడు. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వం, వైసీపీ ఏం మాట్లాడటం లేదన్నారు
చంద్రబాబు.

Tags:    

Similar News