వేదింపులకు పార్టీని వీడితే పిరికితనం కాదా?

వేదింపులకు పార్టీని వీడటం పిరికితనమే అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి శిద్ధారాఘవరావు వైసీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో [more]

Update: 2020-06-10 12:31 GMT

వేదింపులకు పార్టీని వీడటం పిరికితనమే అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి శిద్ధారాఘవరావు వైసీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది, ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీని వీడటం సరికాదన్నారు. అయినా కొత్త వారిని తయారు చేసుకుంటామని చెప్పారు. ఒకరు పోతే వందమంది పార్టీలోకి వస్తారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు పార్టీలో నుంచి వెళ్లినా ఏమీ కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పార్టీని వీడిన వాళ్లు నేడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో గుర్తుతెచ్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

Tags:    

Similar News