ప్రత్యేక హోదా ను ఏం చేశారు?

ప్రత్యేక హోదా దగ్గర నుంచి అమరావతి వరకూ జగన్ మాట తప్పుతూనే ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై జగన్ యూటర్న్ తీసుకున్నారని [more]

Update: 2020-06-06 02:15 GMT

ప్రత్యేక హోదా దగ్గర నుంచి అమరావతి వరకూ జగన్ మాట తప్పుతూనే ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై జగన్ యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని, ప్రజల్లో భరోసా కల్గించని పాలకులు వేస్ట్ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి వైసీపీ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే చరిత్రహీనుల్లా మారిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. పాత పథకాలను పదిని రద్దు చేసి, ఆ సొమ్ముతో ఒక పథకాన్ని అమలు చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News