Chandrababu : రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడిందన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. [more]

Update: 2021-09-20 12:36 GMT

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడిందన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు సీనియర్ నేతలతో స్ట్రాటజీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేశారు. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినా తామే గెలిచామని చెప్పుకోవడం జగన్ పిచ్చికి పరాకాష్ట అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గుజరాత్ లో పట్టుబడ్డ 9 వేల కోట్ల హెరాయిన్ కు తాడేపల్లికి లింకులున్నాయన్నారు. ఏపీని మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆప్ఘనిస్థాన్ స్మగ్గర్లకు తాడేపల్లిలో లింకులున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News