విశాఖ పర్యటన రద్దు… అమరావతికి రెడీ అయిన బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా అమరావతికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విశాఖకు విమాన సర్వీసులు రేపటికి వాయిదా పడటంతో [more]

Update: 2020-05-25 02:21 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా అమరావతికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విశాఖకు విమాన సర్వీసులు రేపటికి వాయిదా పడటంతో చంద్రబాబు విశాఖ టూర్ రద్దయింది. కేంద్ర విమానయాన శాఖ మంగళవారం నుంచి విమానసర్వీసులు విశాఖకు నడపాలని నిర్ణయించడంతో ఆయన తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు విమాన సర్వీసులు రద్దు చేశామని పౌర విమానయానశాఖ ప్రకటించడంతో కావాలని చంద్రబాబు టూర్ ను రద్దు చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట లోకేష్ కూడా అమరావతికి బయలుదేరనున్నారు.

Tags:    

Similar News