ఆ రైతులను పట్టించుకోండి.. చంద్రబాబు ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతుంటే [more]

Update: 2021-06-24 07:57 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతుంటే మరోవైపు కమీషన్లు కావాలంటూ వత్తిడి చేయడం సిగ్గు చేటని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ రెండేళ్ల పాలనలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేరని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News