జగన్ కు ప్రాణాలంటే లెక్క ఉందా?

ప్రజల ప్రాణాలంటే జగన్ కు లేక్కలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ సరఫరా లోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సీరం, భారత్ బయోటెక్ [more]

Update: 2021-05-11 01:33 GMT

ప్రజల ప్రాణాలంటే జగన్ కు లేక్కలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ సరఫరా లోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సీరం, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం, ప్రయివేటు ఆసుపత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోట్ల టీకాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం ఆర్డర్ చేయలేదమని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం కరెక్ట్ కాదన్నారు. జగన్ నిర్వాకం వల్లే ఈరోజు ఏపీలో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News