వారికి అండగా నిలబడండి… బాబు పిలుపు

నివర్ తుపాను బాధితులకు పార్టీ నేతలు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నివర్ తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. [more]

Update: 2020-11-27 02:10 GMT

నివర్ తుపాను బాధితులకు పార్టీ నేతలు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నివర్ తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తుపాను నష్టాన్ని అంచనా వేయాలని, బాధితులను పరామర్శించాలని చంద్రబాబు టీడీపీ నేతలను కోరారు.చంద్రబాబు నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే బాధితులకు సాయం ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News