జగన్ వల్లనే ఇదంతా… లైట్ గా తీసుకోవడం వల్లే

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఖరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తొలి నుంచి కరోనాను జగన్ తేలిగ్గా తీసుకున్నారన్నారు. అందుకే [more]

Update: 2020-08-10 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఖరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తొలి నుంచి కరోనాను జగన్ తేలిగ్గా తీసుకున్నారన్నారు. అందుకే ఏపీలో కేసుల సంఖ్య రోజుకు పదివేలు దాటుతున్నాయన్నారు. కరోనా పెద్ద రోగం కాదని తొలి నుంచి జగన్ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లారన్నారు. అందువల్లే ప్రజలు కరోనాను పట్టించుకోకుండా తిరుగుతున్నారన్నారు. తాను కరోనాపై తొలి నుంచి హెచ్చరిస్తున్నా జగన్ మాత్రం లైట్ గా తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రెండువేల మంది మరణించడానికి జగన్ వైఖరి కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News