ముందు చూపు లేకుండానే

తన ఇంటిని, అమరావతిని ముంచాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో [more]

Update: 2019-08-21 11:40 GMT

తన ఇంటిని, అమరావతిని ముంచాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉంటే వాటిని ఒక పద్ధతి ప్రకారం నింపాల్సి ఉండగా, ముందుచూపు లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయని, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు చంద్రబాబు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని చంద్రబాబు తెలిపారు. ఆయన ఈరోజు గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

Tags:    

Similar News