జగన్ రెచ్చగొడుతున్నారు

వైఎస్ జగన్ కావాలని రెచ్చగొడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిశ చట్టాన్ని తీసుకు వచ్చిన మరుసటి రోజునే గుంటూరులో బాలికపై అత్యాచారం ఘటన జరిగితే [more]

Update: 2019-12-16 07:23 GMT

వైఎస్ జగన్ కావాలని రెచ్చగొడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిశ చట్టాన్ని తీసుకు వచ్చిన మరుసటి రోజునే గుంటూరులో బాలికపై అత్యాచారం ఘటన జరిగితే ఇంతవరకూ చర్య తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వానికి సిగ్గుందా? అని నిలదీశారు. ఎస్సీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. స్పీకర్ గా బాలయోగిని నియమించింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను కూడా సక్రమంగా అమలు పర్చడం లేదన్నారు. వైసీపీ పుట్టకముందే టీడీపీ దళితులకు న్యాయం చేసిందన్నారు. తాను అనని మాటలను కూడా జగన్ వక్రీకరిస్తున్నారని అన్నారు. తాను బాస్టర్డ్ అనకపోయినా అన్నట్లు జగన్ ప్రచారం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News