విలన్లను తట్టుకున్నాం… విజయం మనదే..!

ఈ ఎన్నికల్లో జగన్ కుట్రలకు నరేంద్ర మోడీ, కేసీఆర్ కుతంట్రాలు తోడయ్యాయని, ఎంతోమంది విలన్లను తట్టుకొని నిలబడ్డామని, ఈసారి కూడా మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని ముఖ్యమంత్ర [more]

Update: 2019-05-04 12:41 GMT

ఈ ఎన్నికల్లో జగన్ కుట్రలకు నరేంద్ర మోడీ, కేసీఆర్ కుతంట్రాలు తోడయ్యాయని, ఎంతోమంది విలన్లను తట్టుకొని నిలబడ్డామని, ఈసారి కూడా మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన అమరావతిలోని ఓ రిసార్ట్స్ లో ఎన్నికలపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యర్థుల కుట్రలను ధీటుగా ఎదుర్కున్నామని, ప్రమాణస్వీకారం, ముహూర్తం అంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, కచ్చితంగా మళ్లీ టీడీపీ గెలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని నరేంద్ర మోడీ ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ నష్టం చేయాలని మోడీ, కేసీఆర్ ప్రయత్నించారన్నారు. ఓటర్లు ఏపీకి రాకుండా కేసీఆర్ కుట్రలు చేసినా ప్రజలు స్వంత వాహనాల్లో వచ్చి ఓట్లేశారన్నారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ కుట్ర చేసిందని, ఇది పసిగట్టి తానే అందరూ వచ్చి ఓట్లేయాలని పిలుపునిచ్చానని గుర్తు చేశారు.

Tags:    

Similar News