వైసీపీ గెలిచే ప్ర‌సక్తే లేదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంద‌ని, ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న [more]

Update: 2019-04-20 13:09 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంద‌ని, ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అండ‌ర్ కరెంట్ ఉంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్నా అక్క‌డ ఓటేయ‌కుండా దొరికిన వాహ‌నాన్ని ప‌ట్టుకొని ల‌క్ష‌ల మంది ఏపీకి వ‌చ్చి ఓటేశార‌ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల‌ని వారి చిత్తశుద్ధితో ఓటేశార‌ని పేర్కొన్నారు. న‌రేంద్ర మోడీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని, అధికారులు మోడీని చూసి కాకుండా ప్ర‌జ‌ల‌ను చూసి ప‌నిచేయాల‌న్నారు. త‌న‌కు ఈసీ, సీబీఐతో వ్య‌క్తిగ‌తంగా ఎటువంటి విభేదాలు లేవ‌న్నారు.అధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌ర‌ప‌డంపై ఈసీ ఆంక్ష‌లు విధించ‌డం హేయ‌మ‌ని ఆరోపించారు. ఈసీ విధానాల‌పై త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News