వైసీపీపై చంద్రబాబు ఫైర్

Update: 2018-05-17 11:56 GMT

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సాధించుకోవడం మన హక్కని, మన హక్కులు సాధించుకునేందుకు ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ప్రకాశం జిల్లాలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాము అభివృద్ధి కోసమే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, కానీ వారు నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆఖరికి రెవెన్యూ లోటు బడ్జెట్ కూడా ఇవ్వడం లేదన్నారు. మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని నిలదీయకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనను విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక శుభముహుర్తాన ఎన్టీఆర్ టీడీపీని పెట్టారని, ఎవరైనా టీడీపీని దెబ్బతీయాలని చూస్తే ఆ దెబ్బ వారికే తాకుతుందన్నారు.

Similar News