ఎల్లుండి ఫలితాలు… రేపు చంద్రబాబు కుప్పం పర్యటన

ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిశాక కూడా బిజీగా గడుపుతున్న చంద్రబాబు [more]

Update: 2019-05-21 12:56 GMT

ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిశాక కూడా బిజీగా గడుపుతున్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు గానూ పార్టీలను సమన్వయం చేస్తున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి తిరిగి రానున్నారు. రేపు కుప్పం వెళ్లి ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఎన్నికల సమయంలోనూ బిజీగా ఉన్న చంద్రబాబు కుప్పం వెళ్లలేదు. కౌంటింగ్ కు ముందురోజు ఆయన కుప్పం వెళుతుండటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News