మోడీకి ప్ర‌జాకోర్టులో బుద్ధిచెప్తాం

ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ప్ర‌జాకోర్టులో బుద్ధిచెబుతామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాని మోదీలో [more]

Update: 2019-02-12 08:43 GMT

ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ప్ర‌జాకోర్టులో బుద్ధిచెబుతామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాని మోదీలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవ‌ని, దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని ఉద్దేశ్యం ఆయ‌న‌కు లేద‌న్నారు. మోడీ కంటే తాను సీనియ‌ర్ నేత‌న‌ని గుర్తు చేశారు. విభ‌జించు పాలించు అనేది మోడీ విధాన‌మ‌ని, ఆయ‌న‌కు స‌ర్దార్ ప‌టేల్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే హ‌క్కు కూడా లేద‌న్నారు. రాష్ట్రంలో కోసం తాము పోరాటం చేస్తూ న‌రేంద్ర మోడీ గుండెల్లో నిద్ర‌పొతున్నామ‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం మోడీకి ఊడిగం చేస్తోంద‌న్నారు. ఇంకా ఊడిగం చేసినా త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని, బీజేపీ – వైసీపీ క‌లిసి పోటీ చేస్తే ఇంకా సంతోష‌మ‌ని పేర్కొన్నారు. తాను స్వార్థంతో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి క‌ల‌వ‌లేద‌ని, దేశాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాల‌నే క‌లిశాన‌న్నారు. కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాల‌ని, కాంగ్రెస్ లో ఉంటే అధిష్ఠానం చెప్పిన‌ట్లు న‌డుచుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Tags:    

Similar News