బ్రేకింగ్ : అమరావతిపై తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

రాజధాని నిర్ణయం అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో [more]

Update: 2020-08-06 05:45 GMT

రాజధాని నిర్ణయం అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని అఫడవిట్ దాఖలు చేసింది. చట్ట సభల్లో జరిగిన చర్చ న్యాయ సమీక్షకు కూడా అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్ణయం అధికారం ఎవరి పరిధిలో ఉంటుందని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అఫడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫడవిట్ లో అమరావతి విషయంలో కేంద్రానిక ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News