మిగులు భూములనూ అమ్మేస్తాం…. స్పష్టం చేసిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో కొన్నింటిని ప్రయివేటు వారికి అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ అడిగిన ప్రశ్నకు [more]

Update: 2021-03-23 00:36 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో కొన్నింటిని ప్రయివేటు వారికి అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం చెప్పారు. మిగులు భూముల్లో కొన్నింటిని ప్రయివేటు వారికి అప్పగిస్తామని మంత్రి చెప్పారు. అవసరమైన మేరకే భూములను ప్రయివేటు వారికి ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అనుగార్ ఠాకూర్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏడు వేల ఎకరాల మిగులు భూములున్నాయి.

Tags:    

Similar News