పోలింగ్ ఓకే.. ఫలితాలు వచ్చేసరికి….?

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ ఆరో తేదని ఈ [more]

Update: 2021-02-27 02:08 GMT

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ ఆరో తేదని ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 అసెంబ్లీ స్థానాలున్నాయి. కేరళలో కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో140 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగితే మే 2వతేదీన ఫలితాలు వెలువడతాయి. పోలింగ్, కౌంటంగ్ కు మధ్య దాదాపు నెల రోజుల సమయం ఉండటం ఉత్కంఠను రేపుతుంది.

Tags:    

Similar News